వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు

వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు

హైదరాబాద్‌ : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. మంగళవారం (మే 16వ తేదీ) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో పలుమార్లు సీబీఐ అధికారులు ఎంపీ వైఎష్ అవినాష్‌ను విచారణకు పిలిచి ప్రశ్నించారు. తాజాగా మరోసారి నోటీసు పంపారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్‌ కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది.