జెట్​ ఎయిర్​వేస్​ ఆఫీసుపై సీబీఐ దాడులు

జెట్​ ఎయిర్​వేస్​ ఆఫీసుపై సీబీఐ దాడులు

న్యూఢిల్లీ: బ్యాంక్ ​మోసం కేసులో జెట్​ఎయిర్​వేస్​ ముంబై ఆఫీసుతో పాటు దీని ఫౌండర్​ నరేశ్​ గోయల్​ ఇల్లు సహా ఏడు చోట్ల శుక్రవారం దాడులు చేశామని  సీబీఐ  ప్రకటించింది. గోయల్​ కెనరా బ్యాంకును రూ.538 కోట్లకు మోసం చేసినట్టు కేసు నమోదయింది. విచారణలో భాగంగా గోయల్, ఆయన భార్య అనిత​ ఆఫీసుల్లో, జెట్​ మాజీ డైరెక్టర్​ గౌరంగ్​ ఆనంద్​ శెట్టి ఇంట్లోనూ దాడులు జరిగాయి.

అప్పుల కారణంగా దివాలా తీసిన జెట్​ ఎయిర్​వేస్ 2019 ఏప్రిల్​లో మూతబడింది. దీనిని జలాన్​ కల్రాక్​ కన్సార్షియం బిడ్​ ద్వారా దక్కించుకుంది. యాజమాన్య బదిలీలో మాత్రం సమస్యలు వస్తున్నాయి. ఈ కన్సార్షియం గత సెప్టెంబరులోనే తిరిగి కార్యకలాపాలను మొదలుపెడతామని ప్రకటించింది. కానీ ఆలస్యం జరుగుతోంది.