చెన్నైలోని కోయంబేడులో ఓ వ్యక్తి అమానుషంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగెత్తుకెళ్లి వెళ్తున్న లారీ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 3న బుధవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగింది. మొదట ఈ కేసును పోలీసులు యాక్సిడెంట్ కేసుగా నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ ప్రదీప్ను అరెస్ట్ చేశారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా.. పోలీసులు ఘటనాస్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను గురువారం పరిశీలించారు. ఆ ఫుటేజీలో పోలీసులకు కీలక సమాచారం లభించింది. రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తి.. కావాలనే ఒక్కసారిగా పరిగెత్తుకెళ్లి లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. దాంతో ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తప్పు ఏం లేదని గ్రహించిన పోలీసులు.. డ్రైవర్ను విడిచిపెట్టారు.
ఈ ఘటనకు సంబంధించి కోయంబేడు ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలోని ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘గురువారం సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. దాని ద్వారా ఇది యాక్సిడెంట్ కాదు.. సూసైడ్ అని తేలింది. దాంతో మేం ఈ కేసును 174 సిఆర్పిసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఈ ఫుటేజీని బట్టి డ్రైవర్ను అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా గుర్తించబడలేదు’ అని తెలిపారు.
For More News..