ఉజ్వల పథకం సిలిండర్పై రూ. 200 సబ్సిడీ

ఉజ్వల పథకం సిలిండర్పై రూ. 200 సబ్సిడీ

ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఒక్కో సిలిండర్ పై రూ.200 మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 12 సిలిండర్లకు ఈ  సబ్సిడీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సిలిండర్ ధర తగ్గింపుతో కేంద్రానికి దాదాపు రూ.6,100 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని చెప్పారు. పేదలకు ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.