- రూ.1.69 కోట్లు విడుదల
హైదరాబాద్, వెలుగు : ఉప్పల్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ ప్రాంతంలో రోడ్డు మరమ్మతులకు కేంద్ర రవాణా శాఖ నిధులు విడుదల చేసింది. రూ.కోటి 69 లక్షలు శాంక్షన్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. వెంటనే పనులు ప్రారంభించాలని ఎన్హెచ్ఏఐ అధికారులను కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారు. నిధుల విడుదలైన లేఖను స్టేట్ ఎన్హెచ్ అధికారులకు ఎన్హెచ్ఏఐ రీజినల్ ఆఫీసర్ ఎస్ కే కుశవహ పంపారు. నిధులు విడుదల చేయాలని నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్–భూపాలపట్నం మధ్య ఎన్హెచ్ 163లో భాగంగా ఉప్పల్లో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉంది. ఆ ప్రాంతంలో రోడ్లు డ్యామేజ్ కావడంతో మరమ్మతులకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశామని నేతలు బుధవారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు.