డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారానికి చెక్!..కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం

డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారానికి చెక్!..కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం

డీప్​ఫేక్​ వీడియోలు, తప్పుడు సమాచారానికి చెక్​ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ( అక్టోబర్​ 22) కీలక ప్రతిపాదన చేసింది. కేంద్రం చేసిన ప్రతిపాదన ప్రకారం.. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (AI)తో  సృష్టించే కంటెంట్ ను స్పష్టంగా లేబుల్​ చేయాలి. అసలు కంటెంట్​ ఏదీ, ఆర్టిఫిషియల్​ కంటెంట్ ఏదీ అనేది ఈజీగా గుర్తిం అవకాశం ఉంది. డిజిటల్​ భద్రత, క్వాలిటీ సమాచారం అందించే దిశగా ఇది కీలక ముందడుగు. 

ప్రతిపాదన ప్రకారం.. టెక్​ కంపెనీలు తమ కంటెంట్​ మోడరేషన్​ విధానాలను మార్పు చేయాల్సి ఉంటుంది. AI తో రూపొందించే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, కంటెంట్​ ను తప్పసరిగా లేబుల్​ చేయాలి. ఇది బాధ్యతాయుతమైన AI వినియోగానికి ఓ మార్గం. 

AIవినియోగం.. పెరుగుతున్న ఆందోళన

AI దుర్వినియోగంపై రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది.తప్పుడు సమాచారం యూజర్లకు హాని కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. AI  తో క్రియేట్​ చేసిన డీప్​ ఫేక్​ వీడియోలపై కోర్టుల్లో విచారణ సాగుతోంది. బాలివుడ్​ స్టార్స్​అభిషేక్​ బచన్​, ఐశ్చర్యారాయ్​ బచన్​తమ వీడియోలను ఉపయోగించి డీప్​ ఫేక్​ వీడియోలను తయారు చేశారని అభ్యంతరకరంగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇది ytube  AI శిక్షణ విధానాన్ని సవాల్​ చేశారు. 

AI వినియోగంలో భారత్​ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. గతేడాది ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ వినియోగం మూడు రెట్లు పెరిగిందని స్వయంగా Open AI  సీఈవో ఆల్ట్​ మన్​ చెప్పడం ఏఐ వినియోగం ఏ తీరులో ఉందో తెలుస్తోంది.