న్యూఢిల్లీ: రాష్ట్రాలు, యూనియన్ టెర్రిటరీల కోసం కొవిడ్ 19 ఎమర్జెన్సీ ప్యాకేజీకి కేంద్రం గురువారం ఓకే చెప్పింది. నేషనల్, స్టేట్ లెవెల్ లో అవసరమైన డ్రగ్స్, మెడికల్ ఎక్విప్ మెంట్స్ సమకూర్చుకోవడం, సర్వైలెన్స్ బలోపేతం చేయడం, ల్యాబ్ ల ఏర్పాటు, బయోసెక్యూరిటీ సంసిద్ధత కోసం ఈ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది వందశాతం సెంట్రల్ ఫండెడ్ ప్యాకేజీ అని, మూడు విడతల్లో అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ అన్ని రాష్ట్రాలు, యూటీల చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లెటర్లు రాసింది. మొదటి ఫేజ్ లో వచ్చే జూన్ నాటికి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఫండ్స్ రిలీజ్ చేస్తామంది. ఫేజ్ 1 లో కొవిడ్ 19 హాస్పిటళ్లలో ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు, వెంటిలేటర్లు, ల్యాబ్ ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, వలంటీర్లకు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించింది. కొన్నిల్యాబ్ లను గుర్తించి, వాటిలో డయాగ్నస్టిక్ సామర్థ్యం పెంపు, శాంపిళ్ల ట్రాన్స్ పోర్టుకు మొబిలిటీ సపోర్ట్ అందిస్తామని చెప్పింది.ఈ ప్యాకేజ్ లో భాగంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్స్ (పీపీఈ)లు, ఎన్ 95 మాస్కులు, వెంటిలేటర్లను కేంద్రమే అందిస్తుందని తెలిపింది. హాస్పిటళ్లు, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ యుటిలిటీస్, అంబులెన్స్ లలో డిస్ ఇన్ఫెక్టెంట్లు స్ప్రే చేస్తామని చెప్పింది. ఈ ఏడాది జూన్ వరకు ఫేజ్ 1, జులై నుంచి 2021 మార్చి వరకు ఫేజ్ 2, ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2024 వరకు ఫేజ్ 3 అమలు చేస్తామని చెప్పింది.
కొవిడ్ 19 ఎమర్జెన్సీ ప్యాకేజ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- దేశం
- April 9, 2020
లేటెస్ట్
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
- నార్సింగి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
- పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఏం చేయాలి..?
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!