వర్కింగ్ ప్లేస్ ఉద్యోగులకు అనుగుణంగా ఉండాలి : సీఈవో చరణ్ లక్కరాజు

వర్కింగ్ ప్లేస్ ఉద్యోగులకు అనుగుణంగా ఉండాలి : సీఈవో చరణ్ లక్కరాజు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఉద్యోగులకు స్వేచ్ఛ, వెసులుబాటు, విశ్వాసం కల్పించే వాతావరణాన్ని యాజమాన్యాలు కల్పించాలని స్టూడెంట్​ట్రైబ్​వ్యవస్థాపకుడు, సీఈవో చరణ్​ లక్కరాజు అన్నారు. పనిచేసే ప్రదేశంలో మంచివాతారణం సృష్టిస్తే నిజమైన పనితీరు వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.

 ‘జెన్ జీ, ప‌‌‌‌ని ప్రదేశంలో ఉత్పాద‌‌‌‌క‌‌‌‌త’ అంశంపై ఆదివారం హైద‌‌‌‌రాబాద్ మేనేజ్‌‌‌‌మెంట్ అసోసియేష‌‌‌‌న్ ఆధ్వర్యంలో లెక్చర్ సెష‌‌‌‌న్ నిర్వహించారు. ఆయన గెస్ట్​గా హాజరై మాట్లాడారు. జెన్ జీ స్వాతంత్య్రంతో కూడిన పనితీరుకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. హెచ్ఎంఏ అధ్యక్షుడు అల్వాల దేవేంద‌‌‌‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. యువ‌‌‌‌త‌‌‌‌కు సాధికార‌‌‌‌త క‌‌‌‌ల్పించేందుకు హెచ్ఎంఏ క‌‌‌‌ట్టుబ‌‌‌‌డి ఉంద‌‌‌‌ని చెప్పారు.