సీపీఐకి వందేళ్ల చరిత్ర : సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి 

సీపీఐకి వందేళ్ల చరిత్ర : సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి 

కోహెడ, వెలుగు: ప్రజా సమస్యల పై నిరంతరంగా పోరాడేది సీపీఐ పార్టీ ఒక్కటే అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో తాళ్లపల్లి ఎల్లయ్య, పిల్లి రజిని అధ్యక్షతన జరిగిన  మండల మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం పోరాడుతూ సీపీఐ వందో సంవత్సరం లోకి అడుగు పెట్టిందన్నారు.

దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్షన్ల పెంపు, రైతు రుణమాఫీ తదితర హామీలను నేరవేర్చాలని లేదంటే ప్రజల చేతులో తిరుగుబాటు తప్పదన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్, లక్ష్మణ్, గోపి, జనార్దన్, శంకర్, లక్ష్మణ్, రామచంద్రారెడ్డి, సత్తిరెడ్డి, బాలయ్య, శేఖర్,  ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.