హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన చాడ విజయ భాస్కర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. గురువారం ఉదయం 9.55 గంటలకు హైకోర్టు హాల్లో ఆయనతో చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేయిస్తారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన విజయ భాస్కర్ రెడ్డి.. అక్కడే స్కూల్ చదువు పూర్తి చేశారు. ఓయూలో బీఎస్సీ, లా చదివారు. 1992 డిసెంబర్ 31న లాయర్గా ఎన్రోల్ అయ్యారు. పలు ప్రభుత్వ సంస్థలకు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ లాయర్గానూ పనిచేశారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వ లాయర్గా కొనసాగుతున్నారు.