
భారత స్పిన్నర్ చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ , స్టార్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ధనశ్రీ తన భర్త చాహల్తో కాకుండా శ్రేయస్ అయ్యర్ తో రావడమేంటని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ ఉందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వివాహం నేపథ్యంలో సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అతని సతీమణి రాధిక సజ్దేతో పాటు శ్రేయస్ అయ్యర్, ధనశ్రీ వర్మలు హాజరయ్యారు. సంగీత్ అనంతరం శార్దూల్ ఠాకూర్తో రోహిత్, అయ్యర్, రాధిక, ధనశ్రీ వర్మలు ఫోటోలకు ఫోజిచ్చారు. ఈ ఫోటోలో శార్దూల్ కుడివైపు ధనశ్రీ , రాధిక సజ్దే కూర్చోగా.... ఎడమవైపు శ్రేయస్ అయ్యర్ కూర్చున్నాడు. రోహిత్ శర్మ వెనుకాల నిలబడ్డాడు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. చాహల్ ఎక్కడా? అంటూ అభిమానులు ధనశ్రీని ప్రశ్నిస్తున్నారు.
ధనశ్రీ, శ్రేయస్ అయ్యర్ మధ్య ఏదో సంబంధం ఉందనే పుకార్లు గతంలో షికార్ చేశాయి. అయ్యర్ మోజులో పడి ధనశ్రీ వర్మ.. చాహల్తో విడాకులు తీసుకుంటుందని వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను చాహల్ -ధనశ్రీ ఖండించారు. కానీ తాజాగా మరోసారి చాహల్ లేకుండా శ్రేయస్ అయ్యర్తో ధన శ్రీ కలిసి రావడం హాట్ టాపిక్ అయ్యింది.
చాహల్ తో కాకుండా ధనశ్రీ శ్రేయస్ తో రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఓ పార్టికీ ధనశ్రీ శ్రేయస్ అయ్యర్తో హాజరైంది. ఆ ఫొటోలను సూర్య అభిమానులతో పంచుకోవడంతో పుకార్లు మొదలయ్యాయి. దీనికి తోడు శ్రేయస్ అయ్యర్తో కలిసి ధన శ్రీ స్టెప్పులు వేయడం.... ఆ వీడియోలు వైరల్ అవ్వడం కూడా ఈ అనుమానాలకు కారణమైంది. అయ్యర్ను గుడ్డిగా నమ్మితే చాహల్కు దినేశ్ కార్తీక్కు పట్టిన గతే పడుతుందని అప్పట్లోనే అభిమానులు హెచ్చరించారు.