ఎక్కువ లాభమంటూ రూ. కోటికి టోపి.. చైన్ సిస్టమ్ బిజినెస్ నిర్వాహకుడిపై కేసు నమోదు

ఎక్కువ లాభమంటూ రూ. కోటికి టోపి.. చైన్ సిస్టమ్ బిజినెస్ నిర్వాహకుడిపై కేసు నమోదు
  •     నిజామాబాద్ సీపీ సాయిచైతన్య వెల్లడి

నిజామాబాద్​, వెలుగు: ఇందూర్​ లో  చైన్​ సిస్టమ్ మార్కెటింగ్ దందాతో రూ.కోటి టోపి పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని సీపీ సాయిచైతన్య తెలిపారు. గురువారం సీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. కోటగల్లీకి చెందిన చంద్రశేఖర్​బీఎంబీ కంపెనీ పేరుతో  తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని  నమ్మిస్తున్నాడు. ఇన్వెస్ట్ ​చేసినవారు విత్​డ్రా చేయడానికి ప్రయత్నిస్తే కావడం లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. మల్టీలెవల్​ చైన్​ సిస్టమ్ లో నష్టపోయిన బాధితులు 770 మంది ఉన్నారన్నారు. చైనా బెస్ట్​లింకులతో చైన్​ సిస్టమ్ బిజినెస్​ నడిపినట్లు తేలిందని, మరింత లోతుగా విచారణ చేస్తామన్నారు. ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​అలీ సిబ్బంది ఉన్నారు.