చైతన్యతో చందు.. ఈ సారీ కార్తికేయను మించి

చైతన్యతో చందు.. ఈ సారీ కార్తికేయను  మించి

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య( Naga Chaitanya) ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో రానున్నాడు. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఫామ్ లో ఉన్న చందు మొండేటి(Chandoo Mondeti) డైరెక్షన్ లో మూవీ చేయున్నట్టు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ నుంచి త్వరలో అదిరిపోయే అప్డేట్ వస్తుందని తెలుస్తోంది.ఈ మూవీ సూరత్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథ సాగుతుందని, చైతు బోటు డ్రైవర్ పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ లో నాగచైతన్య కు జోడీగా మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) నటిస్తుంది. చైతన్య తో కీర్తి సురేష్ తొలిసారిగా నటిస్తున్న ఈ కాంబో పై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. చందు మొండేటి ఈ సారి చైతన్య కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు టాక్. గీత ఆర్ట్స్(Geeta Arts) బ్యానర్ పై అల్లు అరవింద్(Allu Aravind) ఈ సినిమాను నిర్మించనున్నారు.

గతంలో చైతన్య, చందు కాంబోలో వచ్చిన ప్రేమమ్ మూవీ డీసెంట్ హిట్ గా నిలువగా.. సవ్యసాచి సినిమాకు డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. ఇక వరుసగా వచ్చిన థ్యాంక్యూ, కస్టడీ వంటి మూవీస్ తో డిస్సపాయింట్ చేసిన చై.. ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్న చందు మొండేటి తో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈ క్రేజీ కాంబోకి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది