నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా పడే చాన్స్

నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా పడే చాన్స్

నిర్భయ దోషుల శిక్షలు ఫిబ్రవరి 1న అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దోషుల తరపు లాయర్ ఏపీ సింగ్ పటియాల హౌజ్ కోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. వినయ్ శర్మ, అక్షయ్, పవన్ లకు సంబంధించి క్యురేటివ్, మెర్సీ పిటిషన్లు వేసేందుకు కావాల్సిన డాక్యుమెంట్లను తిహార్ జైలు అధికారులు ఇంకా ఇవ్వలేదని పిటిషన్ వేశారు. తమకు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని దోషులు పిటిషన్ లో తెలిపారు. ఫిబ్రవరి 1న నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉంది. దీంతో తమ డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలని మళ్లీ కోర్టుకు వెళ్లడంతో ఈ శిక్షల అమలు వ్యవహారంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.