అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్పార్టీ టికెట్ల కసరత్తును మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా లిస్టు రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని హైకమాండ్, రాష్ట్ర స్థాయిలోని పెద్ద లీడర్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పీఏసీ సమావేశంలో సునీల్ కనుగోలు 35 సెగ్మెంట్లలో పార్టీ చాలా వీక్గా ఉందని రిపోర్టు ఇచ్చారు. మొత్తం 119 నియోజకవర్గాలకు మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఎలాంటి వివాదాలు లేని 40 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించనున్నారు. ఈ నెలాఖరుకే 80 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్చేస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే ఇటీవల ప్రకటించినా.. అది సాధ్యం కాకపోవచ్చని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఖరారుపై సెప్టెంబర్ మొదటి వారంలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే మొదటి జాబితా అనౌన్స్చేయనున్నట్టు తెలుస్తున్నది. పార్టీ టికెట్ల కోసం గాంధీ భవన్కు ఆశావహులు క్యూ కడుతున్నారు. రిటైర్డ్ఆఫీసర్లతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి తమకు అవకాశం ఇవ్వాలని వాళ్లు కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు.
అయితే కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో సీనియర్ లీడర్లకు టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (కొడంగల్), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (మధిర), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (కొత్తగూడెం), కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (నల్గొండ), జానారెడ్డి/జైవీర్ రెడ్డి (నాగార్జునసాగర్), రఘువీర్ రెడ్డి (మిర్యాలగూడ), ఉత్తమ్ కుమార్రెడ్డి (హుజూర్నగర్), పద్మావతి (కోదాడ), సీతక్క (ములుగు), కొండా సురేఖ (వరంగల్ఈస్ట్), చిన్నారెడ్డి (వనపర్తి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వంశీచంద్ రెడ్డి (కల్వకుర్తి), సంపత్కుమార్ (ఆలంపూర్), జగ్గారెడ్డి (సంగారెడ్డి), దామోదర రాజనర్సింహ (ఆందోల్), మహేశ్కుమార్ గౌడ్ (నిజామాబాద్ అర్బన్), షబ్బీర్అలీ (కామారెడ్డి), జీవన్ రెడ్డి (జగిత్యాల), శ్రీధర్బాబు (మంథని), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), పొదెం వీరయ్య (భద్రాచలం), బల్మూరి వెంకట్ (హుజూరాబాద్) పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి టికెట్ఆశిస్తున్నారు. గిరిజన చైతన్య యాత్ర పేరిట నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ఈసారి నాగార్జునసాగర్ టికెట్ జైవీర్రెడ్డికేనని ఒకవైపు.. జానారెడ్డికే చాన్స్ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ఉందని మరోవైపు ప్రచారం జరుగుతున్నది.