23 రోజులుగా మృత్యువుతో పోరాడి విషాదం మిగిల్చిండు: చంద్రబాబు

23 రోజులుగా మృత్యువుతో పోరాడి విషాదం మిగిల్చిండు: చంద్రబాబు

నందమూరి తారకరత్న మృతిపట్ల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తారకరత్న మరణవార్త ఎంతో బాధను కలిగించిందని వెల్లడించారు.
తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి తమకు దూరమయి తమ కుటుంబానికి విషాదం మిగిల్చాడన్నారు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు. తారకరత్న కాసేపటి క్రితం  బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.