ఎన్టీఆర్ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారు

ఎన్టీఆర్ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారు

అసెంబ్లీలో ఎన్టీఆర్ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తన భార్య గురించి మాట్లాడటం బాధనిపించిందన్నారు. AP అసెంబ్లీని YCP  కౌరవ సభగా మార్చిందని మండిపడ్డారు. తాను మళ్లీ గౌరవ సభగా మార్చి... ఆ సభకే వస్తానన్నారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు చంద్రబాబు. వర్షాలపై ముందే అలర్ట్ వచ్చినా... ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్నారు. YCP సర్కార్ కు చిత్తశుద్ది ఉంటే ఇంత నష్టం జరిగేదా అని ప్రశ్నించారు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరారు. తప్పుడు పనులు చేసిన... ఎవరిని వదిలి పెట్టనన్నారు చంద్రబాబు.