కేసీఆర్​ పాలనలో రైతుల జీవితాల్లో మార్పు

కేసీఆర్​ పాలనలో రైతుల జీవితాల్లో మార్పు

జగిత్యాల టౌన్/రాయికల్ వెలుగు:  సీఎం కేసీఆర్ పాలనలో రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందని, వారి అభివృద్ధికి కృషి చేశారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శనివారం రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలిసి  తనకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించిందన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదన్నారు.  అనంతరం సీఎం కేసీఆర్​26న జగిత్యాలకు రానున్న దృష్ట్యా సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీ దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజశంగౌడ్ పరిశీలించారు.