మహారాష్ట్ర సీఎంను కలిసిన చరణ్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫొటోస్

మహారాష్ట్ర సీఎంను కలిసిన చరణ్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫొటోస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆయన సతీమణి ఉపాసన(Upasana) మహారాష్ట్ర సీఎం(Maharashtra CM) ఏక్‌నాథ్ షిండేను కలిశారు. స్వయంగా మహారాష్ట్ర సీఎం చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండే, అతని ఫ్యామిలీతో దిగిన ఫోటోలను రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా పైన ఆప్యాయత చూపించి, ఆతిథ్యం ఇచ్చినందుకు మహారాష్ట్ర సీఎం, శ్రీకాంత్ షిండే, మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర,సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.