ఛత్తీస్ గఢ్: బీజేపీ కార్యకర్తలు ఉమ్మితే భూపేష్ భగేల్, అతని క్యాబినెట్ కొట్టుకుపోవడం ఖాయమని ఆ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ దగ్గుబాటి పురందేశ్వరీ అన్నారు. సంకల్పంతో పని చేస్తే ఛత్తీస్ గఢ్ లో 2023లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం బస్తర్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పురందేశ్వరి మాట్లాడారు. పార్టీ పరిస్థితి, ఛత్తీస్ గఢ్ రాజకీయ పరిస్థితులపై ఆమె కార్యకర్తలతో చర్చించారు.
కాగా.. పురందేశ్వరి కామెంట్స్ కు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ కౌంటర్ ఇచ్చారు. ఆకాశం మీద ఎవరైనా ఉమ్మివేయాలనుకుంటే.. అది వాళ్ల మీదే పడుతుందని ఆయన విమర్శించారు.
Addressed karyakarta's in Bastar, Chattisgarh.
— Daggubati Purandeswari ?? (@PurandeswariBJP) September 2, 2021
Rejuvenated excitement was clearly felt. Pray to Maa Danteswari, that her blessings give them the required strength. pic.twitter.com/LLRula4MpJ