
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు తప్పించుకోగా, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గంగులూరు అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు తెలుసుకున్న బీజాపూర్ పోలీస్ ఆఫీసర్లు డీఆర్జీ బలగాలను రంగంలోకి దించారు.
కూంబింగ్ జరుపుతుండగా, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా బీజాపూర్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాయ్పూర్కు తీసుకెళ్లారు. వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని బీజాపూర్ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.