ఫార్మా కంపెనీపై చీటింగ్​ కేసు

ఫార్మా కంపెనీపై చీటింగ్​ కేసు

జీడిమెట్ల, వెలుగు: ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఫేక్​లైసెన్స్​తో డ్రగ్స్​తయారు చేస్తున్న ఫార్మా కంపెనీపై జీడిమెట్ల పోలీసులు చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల, సుభాష్​నగర్ ప్లాట్ నంబర్ 318లోఓవాయిడ్​ ఫార్మా లిమిటెడ్​పేరుతో నర్సపల్లి రాముడు అనే వ్యాపారస్తుడు ఫార్మా కంపెనీ నడుపుతున్నాడు. 

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్​ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ఫోర్జరీ లైసెన్స్​తో డ్రగ్స్​తయారు చేస్తున్నాడు. డ్రగ్​కంట్రోల్​అధికారులు శనివారం దాడులు నిర్వహించి రూ.23.93లక్షల విలువ చేసే 800 కిలోల డ్రగ్స్​స్వాధీనం చేసుకున్నారు. వారి ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.