ఆ చెక్ డ్యాంలు జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారు : వాటర్ మ్యాన్ ఆఫ్ఇండియా రాజేంద్ర

ఆ చెక్ డ్యాంలు జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారు : వాటర్ మ్యాన్ ఆఫ్ఇండియా రాజేంద్ర
  •  
  • ఇసుక మాఫియానే ఇలా చేసి ఉండొచ్చు
  • వాటర్​ మ్యాన్​ ఆఫ్​ఇండియా రాజేంద్ర వెల్లడి​ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: పెద్దపల్లి జిల్లాల్లోని చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌లను పేల్చివేశారని, తన అనుభవంతో క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన తర్వాత ఈ విషయం చెప్తున్నానని వాటర్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా డాక్టర్‌‌‌‌‌‌‌‌ రాజేంద్రసింగ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. తనుగుల చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌, అడవి సోమన్‌‌‌‌‌‌‌‌పల్లి చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌ కూలిపోయిన నేపథ్యంలో నిజనిర్ధారణ కమిటీ పరిశీలించిందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు.

 చెక్ డ్యాంలను పరిశీలిస్తే డ్రిల్లింగ్ ​చేసినట్టు కనిపిస్తున్నదన్నారు. ఇది వరదలకు కూలింది కాదని, ఎలాంటి నీళ్లు లేనప్పుడు కూలిందన్నారు. సాగునీటిపారుదల శాఖ రిటైర్డ్​ సూపరింటెండెంట్​ఇంజినీర్ శ్రీధర్​దేశ్​పాండే మాట్లాడుతూ.. తనుగుల, సోమన్​పల్లి చెక్​డ్యామ్​లు కావాలనే పేల్చేశారని, అక్కడ రాత్రి పూట పెద్ద సౌండ్స్​రావడంతో స్థానికులు పొద్దున అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. 

నాణ్యతాలోపంతో, ఇతర కారణాలతో కూలిపోయినట్టు కనిపించడం లేదన్నారు. జిలెటిన్​స్టిక్స్ పెట్టి పేల్చిన ఆనవాళ్లే కనిపిస్తున్నాయన్నారు.  రెండు రోజుల్లోనే రెండు చెక్​ డ్యామ్​లు ఎలా కూలుతాయని ప్రశ్నించారు. ఇసుక మాఫియానే ఈ విధ్వంసం సృష్టించినట్టు తెలిపారు.