రామచంద్రాపురం, వెలుగు: ఇప్పటి దాకా కాలుష్య కాటుకు దూరంగా ఉన్న ఇక్రిశాట్ను కెమికల్ వేస్టేజ్ చేరుతోంది. ఇటీవలే పడిన వానకు వచ్చిన వరద నీటితో కెమికల్స్ వేస్టేజ్ చేరి ఇక్రిశాట్ చెరువును కలుషితం చేసింది. ఈచెరువులోకి వరద నీటిని తీసుకువచ్చే తెల్లపూర్కాల్వలోకి కెమికల్స్ వేస్టేజ్ డంప్చేయడంతో చెరువులో చేపలు మృతిచెందాయి. ఈ ఘటన ఇక్రిశాట్పేరును మసకబార్చేలా ఉంది. దీంతో పీసీబీ, ఎన్విరాన్మెంటల్ఆఫీసర్లు, సైంటిస్టులు గుట్టుచప్పుడు కాకుండా ఎంక్వైరీ చేస్తున్నారు.
సిటీలో వాన పడిందంటే కెమికల్మాఫియా పండుగ చేసుకుంటోంది. తమ కంపెనీల్లోని కెమికల్వేస్ట్ను గుట్టుచప్పుడు కాకుండా వరద నీటిలోకి, కాలువల్లోకి వదులుతున్నారు. ఈ మాఫియా ఆగడాలతో ప్రమాదకరమైన కెమికల్స్చెరువులు, కుంటలతో పాటు గ్రౌండ్ వాటర్లో చేరి కలుషితం చేస్తున్నాయి. తద్వారా జనం రోగాల బారిన పడుతుండగా, మూగజీవాలు చనిపోతున్నాయి.
రూల్స్ బేఖాతర్
పరిశ్రమల్లోని కెమికల్ వేస్ట్ను ట్రీట్మెంట్ ప్లాంట్లకు పంపాలనే రూల్స్ఉండగా వాటిని బేఖాతర్చేస్తున్నాయి కంపెనీ మేనేజ్మెంట్లు. డేంజరస్ కెమికల్స్ను గుట్టుచప్పుడు కాకుండా రోడ్లపై పారబోస్తున్నారు. ముఖ్యంగా వర్షం కురవడాన్ని అవకాశంగా తీసుకొని కెమికల్ వేస్ట్ను పెద్ద పెద్ద ట్యాంకర్లలో తీసుకొచ్చి నిర్మానుష్య ప్రాంతాల్లో పారబోస్తున్నారు. నాలుగురోజుల క్రితం పటాన్చెరు సెగ్మెంట్లో కురిసిన భారీ వర్షానికి కెమికల్ మాఫియా రెచ్చిపోయింది. తెల్లాపూర్ పరిధిలోని కల్వర్టు వద్ద అర్ధరాత్రి జరిపిన కెమికల్ డంపింగ్ చాలా ఘోరానికి దారి తీసింది. ఆ కల్వర్టు ద్వారా ప్రవహించిన కెమికల్ వేస్ట్ పక్కనే ఉన్న ఇక్రిశాట్ చెరువులో కలిసి వేలాది చేపలు చనిపోయాయి. ఇక్రిశాట్కు కూడా కెమికల్సెగ తగలడంతో ఉన్నత స్థాయి అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. పీసీబీ, ఎన్విరాన్మెంట్ అఫీసర్లకు కంప్లైట్ చేయడంతో బుధవారం గుట్టుచప్పుడు కాకండా విచారణ చేపట్టారు. ఈఈ సురేశ్ బాబు, ఏఈఎస్ సురేశ్ ఇక్రిశాట్ చెరువు, కెమికల్ డంప్ చేసిన ఏరియాలను పరిశీలించారు.
అధికారులకు తెలిసే జరుగుతుందా?
కెమికల్ వేస్ట్ డంపింగ్ వ్యవహారాలన్నీ స్థానిక, జిల్లా అధికారులకు తెలిసే జరుగుతోందనే మాట బలంగా వినిపిస్తోంది. ఆయా కెమికల్ ఇండస్ర్టీలలోని వేస్టేజ్ జీడిమెట్లోని ట్రీట్మెంట్ ప్లాంటుకు తరలించాల్సి ఉండగా ఇలా దొంగల్లా ఎందుకు పారబోస్తున్నారనే ప్రశ్నకు పర్యావరణవేత్తలు విస్తుపోయే వివరణ ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్న కెమికల్ ప్రొడక్స్ట్వల్ల డేంజర్కెమికల్స్రిలీజ్అవుతున్నాయి. వాటిని రూల్స్ప్రకారం ట్రీట్మెంట్ ప్లాంటుకు తీసుకెళ్లే వీలులేకపోవడంతోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. పీసీబీ, పర్యావరణ ఆఫీసర్లు కెమికల్ ఫ్యాక్టరీలలో శాంపిల్స్ సేకరించేటప్పుడు గోల్మాల్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ జేబులు నింపుకోవడానికి ఇలాంటి వ్యవహారాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదాసీనత వల్ల మూగజీవాల మృతితోపాటు గ్రౌండ్వాటర్కలుషితమవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.