ఒడిశాలో పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్

ఒడిశాలో పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్

ఒడిశాలో ఘరో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని జఖాపురా స్టేషన్ సమీపంలో చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో  మూడు బోగీలు పట్టాలు తప్పాయి.   

ఈ  సంఘటన ఫిబ్రవరి 5న  ఉదయం 8గంటల51 నిమిషాలకు  జరిగింది.  ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.  వెంటనే స్పందించిన  రైల్వే అధికారులు  భద్రక్ నుంచి  ప్రమాద స్థలానికి ఒక రెస్క్యూ టీమ్‌ను పంపించారు.  సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు