
కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇంతవరకు రెండు టీఎంసీల పనే పూర్తి కాలేదని... కాని మూడో టీఎంసీకి గత ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. నేషనల్ డేమ్ సేఫ్టీ రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లోనే లోపాలున్నాయని పేర్కొందన్నారు. తన నియోజకవర్గంలో మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్సమస్య ఉందన్నారు. నష్ట పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదన్నారు.వచ్చే వర్షాకాలం లోపు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు.