
కేసీఆర్ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు కానీ పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్ పల్లి గ్రామంలో 588 ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసిడింగ్స్ అందజేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి దోచుకున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. గతంలో చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. వంద ఎకరాల్లో కేసీఆర్ ఫాంహౌస్ కట్టుకున్నాడు కానీ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మాట ఇచ్చి తప్పింది.ప్రజలు పదేండ్లు ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లాలో 15 రోజుల్లోనే 20 వేలకు పైగా రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. అందరూ మీసేవల్లో రేషన్ కార్డులు లేని వారు అప్లై చేయాలి. అధికారులు పరిశీలించి వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి అని అన్నారు వివేక్.
►ALSO READ | దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికలు.. ఆదివాసి కార్మిక సంఘానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మద్దతు
గరీబీ హటావో అనే నినాదాన్ని తీసుకువచ్చింది ఇందిరా గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. ఇచ్చిన గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. రూ.6 చెన్నూరు నియోజకవర్గంలో స్కూల్స్ మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయి. 2 కోట్లతో కస్తూర్బా స్కూల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 50 వేల మంది స్కూల్ టీచర్లను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు వివేక్.