నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి : శ్రీనివాస రెడ్డి

నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి :  శ్రీనివాస రెడ్డి

సిద్దిపేట(దుబ్బాక), వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలో వివిధ అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ నియోజకవర్గ కాంగ్రెస్  ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస రెడ్డి గురువారం జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్  వెంకటస్వామికి విజ్ఞప్తి చేశారు.  

హైదరాబాద్​లో మంత్రిని కలసి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు.