
వరంగల్: గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని బీటీ రోడ్డు బురదమయంగా మారడంతో వరంగల్ జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ యువకులు వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామంలో బస్టాండ్ వద్ద ధ్వంసమైన బీటీ రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. కొద్ది రోజుల క్రితం గ్రామ సర్పంచ్ బీటీ రోడ్డును ధ్వంసం చేసి వదిలేశారని, ఆ తర్వాత మళ్లీ రోడ్డు వేయకుండా నామమాత్రంగా మట్టి పోశారని తెలిపారు. దీని కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అస్తవ్యస్తంగా తయారయిందని అన్నారు. దీంతో ఆ గ్రామ యువకులు పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదివారం రోజున బురదలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు వడ్లకొండ వెంకటేష్ గౌడ్,వడ్లకొండ సంజీవులు గౌడ్,సీపతి కమలేష్, బ్రహ్మణపల్లి శ్రీకాంత్,బూడిద అశోక్,ఎండీ.కరీం,ఇమ్మడి రమేష్,కరుణాకర్, శ్రీను, సిద్దులు తదితరులు పాల్గొన్నారు.