గుడ్ న్యూస్: తెలంగాణ ఉద్యోగులకు డీఏ పెంపు

గుడ్ న్యూస్: తెలంగాణ ఉద్యోగులకు డీఏ పెంపు

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.  ఉద్యోగుల డీఏ 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.  పెరిగిన డీఏ 2023 జనవరి 1 నుంచి అమలు కానుంది. 
 
పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను రిలీజ్ చేయాలని ఇటీవల ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే   రెండు డీఏలు ఇవ్వాలని జూన్ 5న  కేబినెట్  నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏల్లో ఒకదాన్ని వెంటనే అమలు చేసి.. మరో డీఏను వచ్చే ఏప్రిల్ లో ప్రకటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ (జూన్ 13)న ఒక డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపులు, స్కీములకు, జీతాలకు ప్రతి నెలా రూ.22 వేల కోట్లు అవసరమవుతున్నాయని.. కానీ రూ.18వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తున్నందున ప్రతి నెలా రూ. 4వేల కోట్ల లోటు ఉంటోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తిచేశారు.