పర్వతగిరి, వెలుగు : చెస్ఆటద్వారా స్టూడెంట్లలో మేథోశక్తి, ఏకాగ్రత, వ్యూహరచన పెంపొందుతాయని చెస్ నెట్ వర్క్, ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ హరిణి అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి హైస్కూల్లో బుధవారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్వతగిరి ప్రాథమిక, హైస్కూల్స్, మోడల్ స్కూల్, కస్తూర్భా గాంధీ, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లకు చెస్ బోర్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెస్ను మనసుపెట్టి నేర్చుకుంటే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుందని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం నవీన్ కుమార్, చెస్ నెట్వర్క్ ఫౌండర్ కోదాడ సుధీర్, ఎంఈవో భిక్షపతి, రిటైర్డ్ ఎంఈవోలు లింగారెడ్డి, అశోక్, రిటైర్డ్ డిగ్రీ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, పాక రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
