మత తత్వ బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: రంజిత్ రెడ్డి

మత తత్వ బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: రంజిత్ రెడ్డి
  • చేవెళ్ల కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

తాండూర్, వెలుగు: మతతత్వ బీజేపీకి లోక్​సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్​రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్న ప్రధాని మోదీకి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ అమలుచేస్తున్న ఆరు గ్యారంటీలకు  మంచి ఆదరణ లభించిందన్నారు. గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చిందని, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుందన్నారు. పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌, గ్యాస్‌‌‌‌, పప్పు, నూనె ధరలను ఇష్టానుసారంగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొదని సూచించారు.  తాండూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో టౌన్​లో బైక్ ర్యాలీ నిర్వహించారు.