హైదరాబాద్, వెలుగు: గోదావరి – కావేరి నదుల అనుసంధానానికి చత్తీస్గఢ్రాష్ట్రం ఓకే చెప్పింది. తాము వాడుకోని148 టీఎంసీలను ఈ ప్రాజెక్టులో వినియోగించుకోవడానికి గ్రీన్సిగ్నల్ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు ఎన్వోసీ ఇస్తూ ఇటీవల లేఖ రాసింది. దీంతో గోదావరి(ఇచ్చంపల్లి) – కృష్ణా(నాగార్జున సాగర్)– పెన్నా(సోమశిల) – కావేరి(గ్రాండ్ఆనికట్) నదుల అనుసంధానానికి అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నేషనల్వాటర్డెవలప్మెంట్ఏజెన్సీ(ఎన్డబ్ల్యూడీఏ) చత్తీస్ గఢ్రాష్ట్రానికి గోదావరిలో ఉన్న వాటా నీళ్లలో148 టీఎంసీలతో గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించింది.
ఆ148 టీఎంసీలను తాము వినియోగించుకునే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మొదట్లో ఆ రాష్ట్రంఅభ్యంతరం వ్యక్తం చేసింది. రిజర్వుడ్ఫారెస్ట్నుంచి ప్రవహిస్తున్న ఆ నీటిని చత్తీస్గఢ్రానున్న 20 ఏండ్లలో కూడా ఉపయోగించుకునే అవకాశమే లేదని, చత్తీస్గఢ్ఆ నీటి వినియోగానికి ప్రాజెక్టులు ప్రారంభించే లోగానే మహానది నుంచి గోదావరి అనుసంధానం పూర్తి చేస్తామని ఎన్ డబ్ల్యూడీఏ హామీ ఇచ్చింది. ఇలా మహానది నుంచి గోదావరికి మళ్లించే 230 టీఎంసీలను గోదావరి – కావేరి అనుసంధానంలో తరలిస్తామని పేర్కొన్నది. కేంద్ర జలశక్తి శాఖ హామీతోనే 148 టీఎంసీల వినియోగానికి చత్తీస్గఢ్ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగిపోవడంతో భాగస్వామ్య రాష్ట్రాలతో ఎంవోయూపై సంతకాలు చేయించడంలో కేంద్రం నిమగ్నమైంది. త్వరలోనే ప్రాజెక్టు ఫైనల్డీపీఆర్ను అన్ని రాష్ట్రాలకు పంపనుంది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల ఇరిగేషన్సెక్రటరీలతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశమై ఎంవోయూలపై సంతకాలు చేయిస్తారు. ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్షెకావత్అధ్యక్షతన భాగస్వామ్య రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకొని నదుల అనుసంధానం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.