 
                                    భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ అమరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్తూపాన్ని భద్రతాబలగాలు కూల్చివేశాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తర్రెం పోలీస్స్టేషన్ పరిధిలోని గోటుంపల్లి అడవుల్లో గురువారం బలగాలు కూంబింగ్కు వెళ్లాయి. ఈ టైంలో మావోయిస్ట్ స్మారక స్తూపం కనిపించడంతో జేసీబీలతో కూల్చివేశాయి. మావోయిస్టులకు పట్టు ఉన్న గ్రామాల్లో తనిఖీలు చేపడుతున్న బలగాలు.. అమరవీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన స్తూపాలను తొలగిస్తున్నాయి.

 
         
                     
                     
                    