
చికెన్ తింటే కరోనా వస్తదని పుకార్లు పుట్టిస్తున్నారని అది అబద్దమన్నారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పై శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్.. గుడ్లు, చికెన్ తింటే తగ్గుతది. కానీ కరోనా వస్తదని పుకార్లు పుట్టిస్తున్నారు. అది అబద్దమని చెప్పారు. మనిషికి పౌష్టికాహారం ఎంతో అవసరమని నిమ్మ, కమలా బత్తాయి, దానిమ్మ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. నల్లగొండలో పండే బత్తాయి పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా చూడాలన్నారు. కాలనీలు, రైతు బజార్లలో పండ్లు పెట్టాలన్నారు. మామిడి కూడా మంచి శక్తినిస్తాయని.. మనమే వాడుకోవాలన్నారు సీఎం కేసీఆర్.