ప్రతి నిమిషానికి 95 చికెన్ బిర్యానీలు ఆర్డర్.. ఇండియాలో ఇదే టాప్

ప్రతి నిమిషానికి 95 చికెన్ బిర్యానీలు ఆర్డర్.. ఇండియాలో ఇదే టాప్

చికెన్ బిర్యానీ.. ఇండియాలో చాలా మంది చికెన్ బిర్యానీనే ఇష్టపడతారంట. ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా  తిన్న వంటకం కూడా చికెన్ బిర్యానే.  ఈ విషయాన్ని స్విగ్గీ వెల్లడించింది.  2019లో  చాలా మంది ఆర్డర్ చేసుకున్న టాప్ 10 వంటకాల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో చికెన్ బిర్యానీ ముందుంది.  ఇండియాలో  నిముషానికి  95 చికెన్ బిర్యానీ ఆర్డర్ లు వచ్చాయంట.  అంతేకాదు ఇండియాలో గత నాలుగేళ్లుగా ఎక్కువ మంది ఆర్డర్ చేసుకునే వంటకాల్లో  చికెన్ బిర్యానీ టాప్ లో ఉంది.

ఈ సంవత్సరం  అత్యధిక ,అతి తక్కవ రేట్లకు అమ్ముడైన చికెన్ బిర్యానీలను కూడా ప్రకటించింది.  పూణేలోని చికెన్ సాజుక్ బిర్యానీ రూ .1,500 కు అమ్ముడై అత్యంత ఖరీదైన బిర్యానీ.  ముంబైకి చెందిన శాఖాహారి చల్ ధన్నో తవా బిర్యానీ (అకా పులావ్) కు అత్యంత  తక్కవ ధర రూ .19 కే అమ్మారు. ఇక  స్వీట్ ఐటమ్ లలో గులాబ్ జామ్ ఎక్కువగా 17,69,399 ఆర్డర్‌లతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి ప్లేసులో 11,94,732 ఆర్డర్‌లతో  ఫలూడా ఉంది.

అత్యధికంగా ఆర్డర్ చేసుకున్న టాప్ 10 వంటకాల జాబితా

  • చికెన్ బిర్యానీ
  • మసాలా దోస 
  • పన్నీర్ బటర్ మసాలా,
  • చికెన్ ఫ్రైడ్ రైస్
  • మటన్ బిర్యానీ ఉంది, 
  • చికెన్ దమ్ బిర్యానీ,
  • వెజ్ ఫ్రైడ్ రైస్,
  • వెజ్ బిర్యానీ,
  • తందూరి చికెన్ 
  • దాల్ మఖాని