ఒక్క ఛాన్స్ ఇవ్వండి... గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ వినతి

ఒక్క ఛాన్స్ ఇవ్వండి... గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ వినతి

న్యూఢిల్లీ:  గుజరాత్ ప్రజలకు ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని  కోరారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా  కేజ్రీవాల్ అక్కడి ప్రజలకు గుజరాతీలో శుభాకాంక్షలు తెలిపారు. ఆప్ ఘన విజయం సాధించబోతుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. 

‘‘నేను మీ కుంటుంబ సభ్యుడిని, మీ సోదరుడిని. గుజరాత్ లో ఒక్కసారి అధికారం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. విద్యార్థుల కోసం పాఠశాలలు, పేదలకు హాస్పిటళ్లు నిర్మిస్తానని..అయోధ్యలోని రామ మందిరానికి తీసుకెళ్తా’’ అంటూ కేజ్రీవాల్ హామీలిచ్చారు. గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇటీవల కూలిన మోర్బీ బ్రిడ్జి ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని స్పష్టం చేశారు. గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీ  90 నుంచి 95 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 30 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క స్థానాన్ని కూడా ఆ పార్టీ గెల్చుకోలేకపోయింది. పీఎం నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ 20 ఏళ్లుగా పరిపాలన సాగిస్తోంది.