ఈవీఎం గోడౌన్ లను ప్రారంభించిన శశాంక్ గోయల్

ఈవీఎం గోడౌన్ లను ప్రారంభించిన శశాంక్ గోయల్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలక్షన్ ఈవీఎం  గోడౌన్ లను ప్రారంభించారు... ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్.  జయశంకర్ భూపాలపల్లిలోని 100 పడకల హాస్పిటల్ ఆవరణలో ఎలక్షన్ EVM గోడౌన్ ను ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లలో కీరోల్ పోషించే EVM ల భద్రత కోసమే గోడౌన్లు నిర్మించామన్నారు. ఎలక్షన్ వివి ప్యాట్  లాంటి కేకును కట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22 గోడౌన్ల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటి వరకు 20 పూర్తయ్యాయని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో.. కొత్తగా నిర్మించిన EVM గోడౌన్ ను లాంచ్ చేశారు. పోలీస్ బందోబస్తుతో  EVM లను గోడౌన్లలో భద్రపరిచి.. భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్మించేందుకు ఉపయోగిస్తామని తెలిపారు.