
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు స్టూడెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్లోని మెట్టుగూడ డివిజన్ చిలకలగూడ దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దారిచూపారంటూ ధన్యవాదాలు తెలిపారు. హెచ్ఎం మల్లికార్జున్ రెడ్డి , ఉపాధ్యాయులు వెంకట రమణతో కలిసి వచ్చిన విద్యార్థులు మంగళవారం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ను కలిసి మొక్కను బహూకరించారు.
మే 26న జీహెచ్ ఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట హెచ్ఎం మల్లికార్జున్ రెడ్డి ‘సీఎం గారు మా బడికి బాట వేయించండి’ అంటూ ప్లకార్డు పట్టుకుని ధర్నాకు దిగడంతో అడ్డంగా ఉన్న ప్రహరీని తొలగించిన విషయం విధితమే. జీహెచ్ ఎంసీ సహకారంతో అక్కడ రోడ్డు వేయించి స్కూల్కు గేటు కూడా పెట్టించారు.