హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విద్యార్థుల థాంక్స్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విద్యార్థుల థాంక్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్  ఏవీ రంగ‌‌‌‌నాథ్‌‌‌‌ కు స్టూడెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌‌‌‌లోని మెట్టుగూడ డివిజ‌‌‌‌న్‌‌‌‌ చిల‌‌‌‌క‌‌‌‌ల‌‌‌‌గూడ దూద్‌‌‌‌బావి ప్రభుత్వ ప్రాథ‌‌‌‌మిక పాఠ‌‌‌‌శాలకు దారిచూపారంటూ ధ‌‌‌‌న్యవాదాలు తెలిపారు.  హెచ్​ఎం మ‌‌‌‌ల్లికార్జున్ రెడ్డి , ఉపాధ్యాయులు వెంక‌‌‌‌ట ర‌‌‌‌మ‌‌‌‌ణతో క‌‌‌‌లిసి వ‌‌‌‌చ్చిన విద్యార్థులు మంగ‌‌‌‌ళ‌‌‌‌వారం హైడ్రా కార్యాల‌‌‌‌యంలో క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్‌‌‌‌ను క‌‌‌‌లిసి మొక్కను బ‌‌‌‌హూక‌‌‌‌రించారు. 

మే 26న జీహెచ్ ఎంసీ జోన‌‌‌‌ల్ కార్యాల‌‌‌‌యం ఎదుట హెచ్​ఎం మ‌‌‌‌ల్లికార్జున్ రెడ్డి ‘సీఎం గారు మా బ‌‌‌‌డికి బాట వేయించండి’ అంటూ ప్లకార్డు ప‌‌‌‌ట్టుకుని ధ‌‌‌‌ర్నాకు దిగడంతో అడ్డంగా ఉన్న ప్రహ‌‌‌‌రీని తొల‌‌‌‌గించిన విష‌‌‌‌యం విధిత‌‌‌‌మే. జీహెచ్ ఎంసీ స‌‌‌‌హ‌‌‌‌కారంతో అక్కడ రోడ్డు వేయించి స్కూల్​కు గేటు కూడా పెట్టించారు.