ఢిల్లీలో బోరు బావిలో పడి వ్యక్తి మృతి

ఢిల్లీలో బోరు బావిలో పడి వ్యక్తి మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జల్​బోర్డు కు సంబంధించిన బోర్​ వెల్​లో పడి ఒక వ్యక్తి మృతిచెందారు. ఢిల్లీ మంత్రి అతీషి ‘ఎక్స్’లో  ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనపై ఎంక్వైరీ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం కేశోపూర్​లో ఢిల్లీ జల్​బోర్డుకు చెందిన ఎస్టీపీ (సేవేజ్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్) బోర్ వెల్​లో ఒక చిన్నారి పడినట్లు అధికారులకు సమాచారం అందింది. ఎన్​డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని శనివారం అర్ధరాత్రి నుంచి రెస్యూ పనులు చేపట్టారు.

 40 అడుగుల లోతు ఉన్న బోర్​వెల్​కు సమాతరంగా పక్కనే మరో గొయ్యి తీయడం స్టార్ట్ చేశారు. ఆదివారం మధ్యహ్నం 3 గంటల తర్వాత బాధితుడిని బయటకు తీశారు. బావిలో చిన్నారి పడినట్లు మొదట ప్రచారం జరిగినప్పటికీ.. బాధితుడిని 40 ఏండ్ల వ్యక్తిగా గుర్తించారు. అయితే అతను అప్పటికే చనిపోయాడు.