అవసరమైతే కంటైనర్ అంగన్ వాడీలు : కొత్తకోట సీతా దయాకర్ 

అవసరమైతే కంటైనర్ అంగన్ వాడీలు : కొత్తకోట సీతా దయాకర్ 
  •     బాలల హక్కుల కమిషన్​ చైర్​పర్సన్​​ కొత్తకోట సీతా దయాకర్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  వలస వ్యవసాయ కూలీల పిల్లల సమస్యలపై అంతరాష్ట్ర స్థాయిలో కో ఆర్డినేషన్​ అవసరమని బాలల హక్కుల కమిషన్​ చైర్​పర్సన్​ కొత్తకోట సీతా దయాకర్​ పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి రివ్యూ సమావేశాన్ని ఆమె గురువారం నిర్వహించారు.

  తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి కమిషన్​ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీజన్ల వారీగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా చత్తీస్​ఘడ్​ నుంచి వచ్చే వ్యవసాయ కూలీల పిల్లల సమస్యలపై అంతరాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ములకలపల్లి మండలం ధర్మన్న నగర్​లో అంగన్​వాడీ కేంద్రం లేకపోవడంతో..  అవసరమైతే కంటైనర్​ అంగన్​వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  కలెక్టర్​ అంకిత్​  , ఎస్పీ బి. రోహిత్​ రాజు  , అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్​, కమిటీ మెంబర్లు  పాల్గొన్నారు.