థమ్సప్ అనుకుని గడ్డి మందు తాగిండు

థమ్సప్ అనుకుని గడ్డి మందు తాగిండు
  • బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలింపు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఘటన

కరకగూడెం , వెలుగు:  ఐదేండ్ల బాలుడు థమ్స ప్​ అనుకొని గడ్డి మందు తాగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. కరకగూడెం మండలం చొప్పాల గ్రామానికి చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతులు ఇంట్లో థమ్సప్​బాటిల్లో గడ్డిమందు నిల్వ ఉంచారు. వీరి కొడుకు వరుణ్​తేజ్​ఆదివారం ఇంట్లో ఆడుకుంటూ థమ్స్అప్​అనుకొని గడ్డి మందు తాగాడు. 

అనంతరం బాలుడు వాంతులు చేసుకుంటుండగా తల్లిదండ్రులు అడిగారు. బాటిల్​లోని థమ్సప్ తాగినట్లు తెలిపాడు. అది గడ్డి మందు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని వెంటనే108లో వెంటనే కరకగూడెం పీహెచ్ సీకి అక్కడ్నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు.