
- బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలింపు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఘటన
కరకగూడెం , వెలుగు: ఐదేండ్ల బాలుడు థమ్స ప్ అనుకొని గడ్డి మందు తాగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. కరకగూడెం మండలం చొప్పాల గ్రామానికి చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతులు ఇంట్లో థమ్సప్బాటిల్లో గడ్డిమందు నిల్వ ఉంచారు. వీరి కొడుకు వరుణ్తేజ్ఆదివారం ఇంట్లో ఆడుకుంటూ థమ్స్అప్అనుకొని గడ్డి మందు తాగాడు.
అనంతరం బాలుడు వాంతులు చేసుకుంటుండగా తల్లిదండ్రులు అడిగారు. బాటిల్లోని థమ్సప్ తాగినట్లు తెలిపాడు. అది గడ్డి మందు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని వెంటనే108లో వెంటనే కరకగూడెం పీహెచ్ సీకి అక్కడ్నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు.