మాకు నీళ్లు కావాలి..సీఎం కేసీఆర్ కు చిన్నారుల లేఖ

మాకు నీళ్లు కావాలి..సీఎం కేసీఆర్ కు చిన్నారుల లేఖ

హైదరాబాద్ లో  నిత్యం ఏదో ఒక ఏరియాలో తాగునీటి సమస్య ఉంటుంది. అయితే అలకాపూర్ టౌన్ షిప్ కాలనీలో తాగునీటి కోసం జనం తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఇదే విషయంపై అలకాపూర్ కాలనీకి చెందిన  పిల్లలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు లేఖ రాశారు. తమ కాలనీలో డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బందిపడుతున్నామని..తాగునీటి కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. తమ కాలనీకి తాగునీటిని సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు చిన్నారులు.