
మధిర, వెలుగు: మధిర వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు వచ్చిన రైతులకు న్యాయం చేస్తామని కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు తెలిపారు. సోమవారం మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు. రైతులకు చెందిన క్వింటా మిర్చిని 14, 511 రూపాయలకు కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రైతులకు మద్దతు ధర లభించే విధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కృషి చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా మార్కెట్ యార్డ్ లలో మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మాజీ చైర్మన్లు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, బంధం శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ , పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.