కరోనా విస్తరిస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరి నోటా చైనా దేశం గుర్తుకు వస్తున్న విషయం తెలిసిందే. చైనా వైరస్ అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనడంతో ఈ పదం ఇంకా ఎక్కువ వైరల్ అయ్యింది. దీనిపై చైనా దేశం స్పందించింది. కోవిడ్-19ను చైనా వైరస్ అని పిలవడంపట్ల చైనా ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసంది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా చాలా మంది దేశస్థలు చైనా వైరస్ అని పిలుస్తున్నారని.. ఇది తమ దేశాన్ని అవమానించడమేనని తెలిపింది. భారత్ ఆ కుంచిత మనస్తత్వన్ని వ్యతిరేకిస్తుందని ఆశిస్తున్నట్లు ఆ దేశ మంత్రి తెలిపారు. చైనా రిక్వెస్ట్ కి మన విదేశాంగ మంత్రి జైశంకర్ సంఘీభావం ప్రకటించారు. అలా పిలవడం సరికాదని తెలిపారు జైశంకర్.
