- స్పేస్ స్టేషన్కు పంపిన టియాన్వెన్-1 ఆర్బిటర్
- ఏడాదిన్నరలో 1,344 చక్కర్లు
- ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్న లోయలు, నీటి జాడలు
బీజింగ్: చైనాకు చెందిన టియాన్వెన్–1 ఆర్బిటర్ మార్స్ పూర్తి చిత్రాన్ని విజయవంతంగా తీసి స్పేస్ ఏజెన్సీకి పంపించింది. ఈ ఫొటోలో దక్షిణ ధ్రువం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటో తీసేందుకు టియాన్వెన్-1 ఆర్బిటర్, మార్స్ చుట్టూ ఏడాదిన్నర కాలంలో 1,344 సార్లు చక్కర్లు కొట్టిందని చైనా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. తాజాగా టియాన్వెన్–1 పంపిన చిత్రాల్లో లోయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించింది. మార్స్పై నీటి జాడలు ఉన్న ప్రాంతాన్ని కూడా ఆర్బిటర్ గుర్తించిందని, నీళ్లు మొత్తం ద్రవ రూపంలోనే ఉన్నట్టు చెప్పింది. అదేవిధంగా 4,000 కిలో మీటర్ల పొడవైన కాన్యన్ వల్లేస్ మారినెరిస్ ఫొటోలను కూడా ఆర్బిటర్పంపిందని తెలిపింది.
మార్స్ ఉత్తరాన ఉన్న అరేబియా టెర్రా అని పిలువబడే ఎత్తయిన ప్రాంతాల కారణంగా క్రేటర్స్ ఏర్పడ్డాయని వివరించింది. 18వేల మీటర్ల అస్ర్కేయస్ మోన్స్ టాప్, డౌన్ వీవ్తో పాటు ఓ అగ్ని పర్వత చిత్రాన్ని కూడా ఆర్బిటర్ పంపినట్టు చైనీస్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ఆర్బిటర్ ప్రతీ మార్టిన్ రోజూ మూడు సార్లు మార్స్ చుట్టూ తిరుగుతోందని, వేగాన్ని కూడా సెకన్కు 78 మీటర్లకు పెంచినట్టు ఇంజనీర్లు తెలిపారు.
2021 ఫిబ్రవరిలోనే కక్ష్యలోకి ఆర్బిట్చైనా తొలి ప్రయత్నంలోనే 2021, ఫిబ్రవరిలో మార్స్ కక్ష్యలోకి ఆర్బిట్ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. రోవర్ను కూడా సేఫ్ ల్యాండ్చేయడంలో చైనీస్ సైంటిస్టులు సక్సెస్ అయ్యారు. మార్టిన్ ఆర్బిట్ కక్ష్యలోకి చేరుకున్న తరువాత.. తొలిసారి టియాన్వెన్–1 ఆర్బిటర్ కీలక మైలురాయిని చేరుకుంది. 2018లో ఓ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా దక్షిణ ధ్రువంలోనే నీటి జాడలను గుర్తించింది. ఐస్ రూపంలో నీళ్లు నిల్వ ఉన్నట్టు ప్రకటించింది.