ఉత్తర లడాఖ్లో గల్వాన్ నదీ ప్రవాహాన్ని దెబ్బ తీసేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టు తాజా శాటిలైన్ ఇమేజెస్లో స్పష్టమయ్యింది. ఇందుకోసం సరిహద్దుల్లో చైనా బుల్డోజర్లను కూడా మోహరించినట్టు తెలుస్తోంది. మూడ్రోజుల క్రితం ఇండియా–చైనా సైనికులు తలపడిన స్థలానికి కిలోమీటర్ దూరంలోనే భారీగా బలగాలను మోహరించినట్టు సమాచారం. మన మేజర్ జనరల్, చైనా మేజర్ జనరల్తో రెండ్రోజులుగా గల్వాన్ వ్యాలీలో చర్చలు జరిపినా ఎటువంటి ఫలితం లేకపోయింది. బలగాలను వెనక్కి తీసుకునేందుకు చైనా అంగీకరించలేదు. నేషనల్ చానెల్స్కు దొరికిన శాటిలైట్ ఫొటోల్లో చైనా బుల్డోజర్లను వాడినట్టు క్లియర్గా కనిపించింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) దగ్గర చైనా వైపు గల్వాన్ నదీ ప్రవాహాన్ని మార్చినట్టుగా అందులో కనిపించింది. ఇదే ప్రాంతంలో వందకుపైగా చైనా వెహికల్స్ ట్రక్కులు, మిలిటరీ వాహనాలు, బుల్డోజర్లు కనిపించాయి. దాదాపు ఎల్ఏసీకి అవతల ఐదు కిలోమీటర్ల పరిధిలో చైనా వాహన శ్రేణి విస్తరించి ఉంది. రెండు ప్రాంతాల్లో సైనికులు ఉండేందుకు గుడిసెలను ఏర్పాటు చేశారు. గల్వాన్ వ్యాలీకి రెండు కిలోమీటర్ల దూరంలో మన ఆర్మీ ట్రక్కులు కనిపించాయి. అయితే ఈ ఇమేజ్లను సెక్యూరిటీ కారణాల వల్ల పోస్ట్ చేయలేదు. ప్రస్తుతం గల్వాన్ నది ప్రవాహం మామూలుగానే ఉందని, ఎటువంటి మార్పు లేదని మన ఆర్మీ వర్గాలు తెలిపాయి.

