ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ : చీఫ్ గెస్ట్గా చిన్న జీయర్ స్వామి

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ : చీఫ్ గెస్ట్గా చిన్న జీయర్ స్వామి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో వస్తున్న ఆదిపురుష్(Adipurush) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న తిరుపతిలో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామీ(Chinna Jeeyar Swamy) చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో చిన్న జీయర్ భక్తులు చాలా మంది ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారని సమాచారం.

రామాయణ(Ramayanam) గాధ ఆధారంగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Kriti sanon) నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్ అండ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. 

దాదాపు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ కు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియాలంటే జూన్ 16 వరకు ఆగాల్సిందే.