ఒక్కొక్క సినిమాను పూర్తి చేసేందుకు పర్ఫెక్ట్ ప్లానింగ్

ఒక్కొక్క సినిమాను పూర్తి చేసేందుకు పర్ఫెక్ట్ ప్లానింగ్

బ్యాక్ టు బ్యాక్ కమిట్‌‌మెంట్స్‌‌తో క్షణం తీరిక లేకుండా ఉన్నారు చిరంజీవి. ఒక్కొక్క సినిమానీ పూర్తి చేసేందుకు పర్‌‌‌‌ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ముందుగా ‘గాడ్ ఫాదర్’ మూవీని కంప్లీట్ చేయనున్నారు. రీసెంట్‌‌గా చిరంజీవి లుక్ రిలీజ్ చేసినప్పుడు దసరాకి సినిమాను  విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో షూటింగ్‌‌లో స్పీడ్ పెంచాడు దర్శకుడు మోహన్ రాజా. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో ఒక షెడ్యూల్ జరుగుతోంది. ఈ సినిమాకి ఇదే చివరి షెడ్యూల్ అని తెలిసింది. క్లైమాక్స్ సీన్స్ తీస్తున్నారట. చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్,  సత్యదేవ్ కూడా ఇందులో జాయిన్ అవుతున్నారట. రీసెంట్‌‌గా లొకేషన్ నుంచి కొన్ని ఫొటోస్ కూడా లీకయ్యాయి. సరిగ్గా కనిపించీ కనిపించకుండా ఉన్న ఆ ఫొటోస్‌‌లో చిరంజీవి యాక్షన్‌‌ మోడ్‌‌లోనే ఉండటంతో ఈ వార్తలు నిజమేనని అర్థమవుతోంది.

వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి సెప్టెంబర్‌‌‌‌ సెకెండ్ వీక్‌‌ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేస్తారట.  నయనతార కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రీసెంట్‌‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న బిజూ మీనన్, దర్శకుడు పూరి జగన్నాథ్  అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్‌‌ చరణ్, ఆర్‌‌‌‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘లూసిఫర్’కి రీమేక్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు మెహర్ రమేష్‌‌తో ‘భోళా శంకర్‌‌’‌‌, బాబి డైరెక్షన్‌‌లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల్లో నటిస్తున్నారు చిరంజీవి.  వెంకీ కుడుములతోనూ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.