మురళీమోహన్‌ ను పరామర్శించిన చిరంజీవి దంపతులు

మురళీమోహన్‌ ను పరామర్శించిన చిరంజీవి దంపతులు

ప్రముఖ సీనియర్ నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీ మోహన్ ను మెగస్టార్‌ చిరంజీవి దంపతులు పరామర్శించారు. వెన్నెముక ఆపరేషన్ చేయించుకున్న మురళీ మోహన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మే 14న వారణాసిలో తన తల్లి అస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్ల సూచనతో  వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. వారం రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మురళీమోహన్… ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో కోలుకుంటున్నారు.